వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్ప ఆత్మహత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బంధువులు, అందుకే నీరుగార్చే యత్నం: రోజా

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థి డాక్టర్ శిల్ప మృతి వెనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బంధువులున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిల్ప మృతి కేసును నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

శిల్ప ఆత్మహత్య దర్యాప్తు నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని రోజా డిమాండ్ చేశారు. సీనియర్ డాక్టర్లను రెచ్చగొట్టి జూనియర్ డాక్టర్ల పోరాటాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. శిల్ప కుటుంబసభ్యులతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని రోజా తెలిపారు.

 rk roja on Shilpa suicide case issue

ఇది ఇలా ఉంటే, డాక్టర్ శిల్ప మృతి ఘటనలో ప్రిన్సిపాల్ రమణయ్యను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ డాక్టర్లు తప్పుపడుతున్నారు. రమణయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు.

అయితే, రమణయ్యపై సస్పెన్ ఎత్తివేత్తే తీవ్ర ఉద్యమం తప్పదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. కాగా, శిల్ప ఆత్మహత్య కేసుకు సంబంధించిన నివేదికన చిత్తూరు జిల్లా కలెక్టర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయనకు తెలిపారు.

English summary
YSRCP MLA RK Roja responded on Silpa suicide issue. she accuses TDP MLAs relatives hand in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X