అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ: నలుగురు మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌‌ను ఓ లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

ఈ ఘటన ఓడీసీ మండలం గాజుకుంటపల్లి వద్ద చోటుచేసుకుంది. పెళ్లి ట్రాక్టర్‌ దిగువపల్లి నుంచి కదిరికి వెళ్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ.. పెళ్లి ట్రాక్టర్‌ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయలయ్యాయి.

 Road accident in Anantapur district: Four killed, few injured

పెళ్లికొడుకు తల్లి లక్ష్మమ్మ, సమీప బంధువులైన చిన్నారులు నాగేశ్వరి(12) మంజునాథ్(10) కార్తీక్(12)లు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మరో పది నిమిషాల్లో పెళ్లి మంటపానికి ఈ బృందం చేరుకునేది. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం లో వివాహం జరగాల్సి ఉంది.

English summary
Four killed and few injured in a road accident occurred in Anantapur district on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X