వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షోరూమ్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన పెను ముప్పు...బ్రేకులు పనిచేయక...

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళుతున్న ఈ పల్లెవెలుగు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బజాజ్‌ షోరూమ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం...ఏలూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు చింతలపూడి మీదుగా అశ్వారావుపేట వెళుతోంది.

RTC bus crashed into Bajaj showroom...Four seriously injured
బస్సు చింతలపూడి చేరుకున్నాక అక్కడ బస్టాండ్ లో ప్రయాణికులను ఎక్కించుకొని బయలుదేరి స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బ్రేకులు పనిచేయకపోవడంతో పాటు స్టీరింగ్‌ పట్టేయడంతో పక్కనే ఉన్న బజాజ్‌ షోరూమ్‌లోకి దూసుకెళ్లింది.

బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బజాజ్‌ షోరూమ్‌లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగనప్పటికి షోరూమ్ లో పనిచేస్తున్న కొక్కిరగడ్డ రాజశేఖర్, మెకానిక్‌ తేజ, వేమారెడ్డిలకు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సీహెచ్‌ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బజాజ్ షో రూమ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

English summary
Three seriously injured when the APSRTC bus crashed into Bajaj shoroom in west godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X