ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై కిరణ్కు హైకోర్టు షాక్
గవర్నర్ నరసింహన్ తొలుత ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల నియామకంపై పునరాలోచన చేయాలని, వారి స్థానంలో ఆరు వారాల్లోగా కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గవర్నర్ ఆమోదించని ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిలను తొలగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంధ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు నలుగురి నియామకంపై పునఃసమీక్షించి, కొత్త వారిని నియమించాలని ఆదేశించింది.
కాగా, ఎనిమిది మందిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్కు ఫైల్ పంపగా, అందులో నలుగురికి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఆ నలుగురి ఫైలును ప్రభుత్వం మరోసారి పంపించి గవర్నర్చే ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో స్వచ్ఛంధ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అప్పుడు విజయ్ బాబు, ప్రభాకర్, మధుకర్ రాజు, రతన్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇంతియాజ్, విజయ నిర్మల, వెంకటేశ్వర్లు, తాంతియా కుమారిల ఫైలును కిరణ్ ప్రభుత్వం రెండోసారి పంపించి ఆమోద ముద్ర వేయించుకుంది.