బిజెపికి షాక్: ఆ మంత్రి టిడిపిలో చేరుతారా?, కారణమిదే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కామినేని శ్రీనివాస్ బిజెపిని వీడి టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి శ్రీనివాస్ కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ప్రకటిస్తున్న
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కామినేని శ్రీనివాస్ బిజెపిని వీడి టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి శ్రీనివాస్ కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ప్రకటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. టిడిపితో తెగతెంపులు చేసుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ బిజెపిలో కొనసాగితే మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తోందనే అభిప్రాయంతో శ్రీనివాస్ ఉన్నారనే ప్రచారం ఉంది.
ఈ కారణంగానే ఆయన బిజెపిని వీడి టిడిపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదనేది మంత్రి శ్రీనివాస్తో పాటు ఆయన సన్నిహితులు కూడ వాదిస్తున్నారు.
టిడిపితో బిజెపి పొత్తును వదులుకొని వైసీపీకి దగ్గరైతే రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొనే అవకాశాలు లేకపోలేదు. ఈ తరుణంలోనే కామినేని టిడిపిలో చేరాలని భావిస్తున్నారని ప్రచారంలో ఉంది. బిజెపి సిద్దాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరాను. ఆ పార్టీని వీడే ప్రసక్తే లేదని కామినేని చెబుతున్నారు.