బాబు,జగన్ చూపు తెలంగాణవైపే,మనకొద్దు: సబ్బం
విశాఖ: రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర హక్కుల సాధన, ఈప్రాంత అభివృద్ధికి పని చేసేందుకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని మాజీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరి శనివారం అభిప్రాయపడ్డారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అవశేష ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి పునాది వేయాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ సహా రాజకీయపార్టీలన్నీ రెండు రాష్ట్రాల్లోనూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సీమాంధ్ర అభివృద్ధి, హక్కుల విషయంలో పూర్తి స్పష్టతను ఇవ్వలేకపోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందన్నారు.