సబ్బంతో సంబంధం లేదు, జగన్ను బాధించాయి: శోభా
అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు, ఇతరులు జగన్ పైన మండిపడటాన్ని తప్పు పట్టారు. జగన్ పైన విమర్శలు చేసే బదులు సమైక్యంగా ఉంచే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఏకవ్యాఖ్య లేఖ ఇస్తే జగన్ సంతకం చేస్తారన్నారు.
అలా కాకుంటే తమ పార్టీ లేదా సమైక్యాంధ్ర ఐకాస ఇచ్చే సమైక్య లేఖపై చంద్రబాబు సంతకం పెట్టేందుకు సిద్దమా అని సవాల్ చేశారు. తాము సమైక్యాంధ్ర కోసం ఏ అడుగు వేసినా ఆయన తప్పుపడుతున్నారని, ఎవరు దొంగలో తేలాల్సిన సమయం వచ్చిందన్నారు.
సమైక్యం రాసిన లేఖపై సంతకానికి చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రావులు సిద్ధమా చెప్పాలన్నారు. టిడిపిని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర చేయాల్సిన అవసరం లేదని, బాబు విధానాలే ఆ పార్టీని దెబ్బతీస్తాయన్నారు.
తమ పార్టీనే దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని, విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని బాబుకు తాము చెప్పామా అన్నారు. కాంగ్రెసు నిర్ణయాన్ని వ్యతిరేకించిన తమతో డీల్ కుదిరిందా లేక లేఖ ఇచ్చిన బాబుకు కుదిరినట్లా అన్నారు. బాబు లేఖను వెనక్కి తీసుకోవాలని రామోజీ రావు, తోక పత్రికలు ఎందుకు అడగడం లేదన్నారు.