జగన్ కు చేతగాక పారిపోయాడు ... సాధినేని యామిని సంచలనం
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఈసారి జగన్ ని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసేందుకు జగన్, కెసిఆర్, మోడీ లతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మహిళలకు రుణమాఫీ చేస్తే అది నా వల్ల కాదంటూ మడమతిప్పి పారిపోయాడని జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సాధినేని యామిని.
రైతులకు రుణమాఫీ విషయంలో కూడా 2014లోనే చంద్రబాబు రుణమాఫీ చేస్తారు అని చెప్తే జగన్ అది కూడా చేతకాదని పారిపోయాడని ప్రస్తుతం మహిళలకు ఇస్తున్న పసుపు కుంకుమ చక్కర విషయంలోనూ వైసిపి నేతలు మహిళల్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారని చెప్పిన యామిని మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిన చంద్రబాబు నాయుడిని మహిళలంతా ఆదరిస్తారని రానున్న ఎన్నికల్లో జగన్ కు చెంపపెట్టు సమాధానాన్ని మహిళలు ఇస్తారని యామిని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను భ్రష్టు పట్టించే నాయకుడు ఎవరైనా ఉంటే అది జగన్ అంటూ యామిని జగన్ ను టార్గెట్ చేశారు.
అనిత కు సీటు లేనట్లేనా : అమరావతిలో అసమ్మతి గళం : బాబు కీలక నిర్ణయం..!