ఏపీ సీఎస్ పై యామిని షాకింగ్ కామెంట్స్ ..పసుపు కుంకుమకు సీఎస్ అడ్డంకులు.. ప్రజలే తరిమికొడతారు
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను పావుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం చేతిలో సీఎస్ పావుగా మారారని... పసుపు-కుంకుమ డబ్బు మహిళలు అందకుండా ఎల్వీ సుబ్రమణ్యం కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఇంతవరకు ఇలాంటి సీఎస్ ను చూడలేదని ఆమె అభిప్రాయపడ్డారు . సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజలే తరిమి కొడతారని యామిని పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడై ఉండి సభ్యత లేకుండా మాట్లాడటం దారుణమన్నారు.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డ ఆమె తిరుమల శ్రీవారి బంగారంపై వైసీపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు.భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని యామిని విమర్శించారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, ఆ పలితాలతో వైసీపీ నేతలకూ ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ యామిని పేర్కొన్నారు .