చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీఫక్కీలో సాక్షి సిబ్బంది నుండి 32 లక్షలు దోపిడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi staff robbed in Chittoor district
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంటలో శనివారం జరిగిన దారి దోపిడీ కలకలం సృష్టించింది. సినీ ఫక్కీలో ఈ దారి దోపిడీ జరిగింది. దుండగులు సాక్షి దినపత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకుని వెళ్లారు. ఈ సంఘటనపై సాక్షి సిబ్బంది ఫిర్యాదు మేరకు గాడులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి డబ్బును సంచుల్లో తీసుకుని ఎస్‌బిఐలో జమ చేయడానికి బయలుదేరారు. సాక్షి సిబ్బంది ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ స్కార్పియో వాహనం అనుసరించి ఢీకొట్టింది.

స్పార్పియో ఢీకొట్టడంతో సాక్షి ఉద్యోగులు ఇద్దరు కిందపడిపోయారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయాలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు డబ్బులు తీసుకుని వెళ్తున బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు.

ఈ సంఘటన ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

English summary
Sakshi daily staff has been robbed at Renigunta near Tirupathi in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X