సినీఫక్కీలో సాక్షి సిబ్బంది నుండి 32 లక్షలు దోపిడీ
సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి డబ్బును సంచుల్లో తీసుకుని ఎస్బిఐలో జమ చేయడానికి బయలుదేరారు. సాక్షి సిబ్బంది ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ స్కార్పియో వాహనం అనుసరించి ఢీకొట్టింది.
స్పార్పియో ఢీకొట్టడంతో సాక్షి ఉద్యోగులు ఇద్దరు కిందపడిపోయారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయాలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు డబ్బులు తీసుకుని వెళ్తున బ్యాగ్ను ఎత్తుకెళ్లారు.
ఈ సంఘటన ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Comments
English summary
Sakshi daily staff has been robbed at Renigunta near Tirupathi in Chittoor district.