కాంగ్కు విభజన షాక్: జగన్ పార్టీలోకి మంత్రి శత్రుచర్ల?
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయమై ఆయన తన అనుచరుల నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశానికి కురుప్పాం శాసన సభ్యుడు జనార్ధన్ థాట్రాజ్ కూడా హాజరయ్యారు.
రాష్ట్ర విభజన నిర్ణయం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మరికొందరు చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగా, ఇటీవల నెల్లూరు నుండి ఆనం సోదరులు ప్రధాన అనుచరుడు పెంచల్ రెడ్డి, అనంతపురంలో టిడిపి నేత పేరం నాగి రెడ్డి చేరారు.
తెలుగుదేశం పార్టీలోకి కూడా కాంగ్రెసు పార్టీ నుండి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే అవకాశారున్నాయంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు సహా ఓ సామాజిక వర్గానికి చెందిన నలుగురు కొద్ది రోజుల్లో తెలుగుగుదేశం పార్టీలో చేరనున్నారట.