స్కూల్ బస్ కి నిప్పంటించిన దుండగులు
గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోఓ పాఠశాల బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగులబెట్టారు.
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోఓ పాఠశాల బస్సుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగులబెట్టారు. స్థానిక గురజాల పట్టణం లో ఆక్స్ఫర్డ్ పాఠశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి పట్టణం లో ఉన్న పాఠశాల కు పిల్లలను చేరవేసేందుకు నాలుగు బస్సులు దైద గ్రామంలో ఓ ప్రాంతం లో రాత్రికి పార్కింగ్ చేసుకుంటారు.
ఉదయాన్నే విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాల కి చేరుస్తారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు ఝామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్ ని పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ పాఠశాల కు చెందిన మూడు బస్సులు మరో ప్రక్క పెట్టి ఉన్నాయి. వాటికి ఏమీ కాలేదు.
కానీ ఈ బసు మాత్రం మిగిలిన మూడు బసు లకు సంబంధం లేకుండా పెట్టాడు డ్రైవర్. తెల్లవారుఝామున బసు లోనుండి దట్టంగా మంటలు పొగలు రావటం చూసిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బస్ మొత్తం తగులబడింది.