వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈస్టిండియా కంపెనీకి చంద్రబాబుకు తేడా లేదు: తమ్మినేని సీతారాం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈస్టిండియా కంపెనీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య తేడా ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో పేదల భూములను లాక్కుంటోందని ఆయన విమర్శించారు.

రాజధాని పేరుతో తాబేదారులకు చంద్రబాబు భూములను కట్టబెడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. రైతుల పొట్ట కొట్టి రాజకీయ నాయకుల జేబులు నింపుతున్నారని ఆయన మండిపడ్డారు.

Seetaharam equates Chandrababu with East India company

తెలుగుదేశం పార్టీ నేతలకు, వారి బంధువులకు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్టోందని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader Tammineni Seetahram has equated Andhra Pradesh CM Nara Chandrababu Naidu with East India company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X