ఏపి ఆర్టీసికి తీవ్ర నష్టం.!ఐనా తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకారం.!మంగళవారం నుండి బస్సులు తిరిగే ఛాన్స్.
అమరావతి/హైదరాబాద్ : కరోనా ఆంక్షల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటుతో అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ గాడిలో పడుతుందని అందరూ భావించారు. కాని ఎప్పరూ ఊహించని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తోంది. దసరా పండుగ సందర్బంగా ప్రతిష్టంభన తొలగి రెండు రాష్ట్రాల మద్య బస్సులు తిరుగుతాయని అందరూ ఊహించారు. కాని దసరా పండుగ సందర్బంగా కూడా రెండు రాష్ట్రాల మద్య అవగాహన కుదరక పోవడంతో ప్రయాణీకులు అనేక సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య తాజాగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
రవాణా వ్యవస్థకు పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల మధ్య కుదురుతున్న ఒప్పందాలు..
తెలుగు
రాష్ట్రాల
మధ్య
రవాణా
వ్యవస్థ
స్తంభించడంతో
ప్రయాణికులు
అనేక
ఇబ్బందులు
పడ్డట్టు
తెలుస్తోంది.
ఓవైపు
ప్రైవేట్
ట్రావెల్స్
దోపిడీ
మరీ
రెట్టింపు
కావడం,
రేట్లు
అధికంగా
వసూలు
చేస్తున్నా,
ఏపీఎస్ఆర్టీసీ,
టీఎస్
ఆర్టీసీ
చేష్టలుడిగిపోయింది
తప్ప
పరిష్కారం
చూపలేదు.
చివరకు
దసరా
సీజన్
కూడా
అయిపోయింది.
ఆర్టీసీకి
ఆదాయం
గణనీయంగా
తగ్గిపోయింది,
అదే
సమయంలో
ప్రయాణికుల
జేబులకి
భారీగా
చిల్లులు
కూడా
పడ్డాయి.
తాజాగా
రెండు
రాష్ట్రాల
రవాణా
శాఖ
అధికారుల
మధ్య
సయోధ్య
కుదిరడంతో
రెండు
తెలుగు
రాష్టాల
మద్య
బస్సులకు
పచ్చజెండా
ఊపే
తరుణం
సమీపించినట్టు
తెలుస్తోంది.
ఏపి ప్రతిపాదనలను తిరస్కరించిన టీ సర్కార్.. నష్టమని తెలిసినా పట్టు సడలించుకున్న ఏపి..
సోమవారం
జరిగిన
ఇరురాష్ట్రాల
రవాణ
శాఖ
ఉన్నతాదికారుల
చర్చలు
కొలిక్కి
వస్తే
మంగళవారం
నుండి
అంతర్రాష్ట్ర
బస్సు
సర్వీసులు
పునఃప్రారంభమవుతాయి.
తెలంగాణలో
ఏపీ
బస్సులు,
ఏపీలో
తెలంగాణ
ఆర్టీసీ
బస్సులు
ప్రత్యక్షమతాయి.
ఏపీఎస్ఆర్టీసీ,
టీఎస్ఆర్టీసీ
అధికారుల
మధ్య
కుదిరిన
అవగాహన
మేరకు,
తెలంగాణ
ఆర్టీసీ
ఏపీ
పరిధిలో
1,61,258
కిలోమీటర్ల
మేర
బస్సులను
తిప్పేందుకు
నిర్ణయం
తీసుకుంది.
అదే
ఏపీ
తెలంగాణ
పరిధిలో
1,60,919
కిలోమీటర్ల
మేర
తన
బస్సుల్ని
నడిపేందుకు
సుముఖత
వ్యక్తం
చేసినట్టు
తెలుస్తోంది.
లాక్డౌన్
ముందు
వరకు
ఏపీ
బస్సులు
2,65,367
కిలోమీటర్లు
తన
బస్సుల్ని
తెలంగాణ
పరిధిలో
నడపగా,
తాజా
ప్రతిపాదనల
మేరకు
లక్షకు
పైగా
కిలోమీటర్లలో
కోతపడనున్నట్టు
నిర్ధారణ
అవుతోంది.
ఏపీకి భారీ నష్టం.. ప్రత్యామ్నాయం దిశగా ఏపి ప్రణాళికలు..
అంతే
కాకుండా
అమరావతి-హైదరాబాద్
మార్గంపై
తెలంగాణ
రవాణా
అధికారులు
సూచించిన
ప్రతిపాదనలే
అమలు
కాబోతున్నట్టు
తెలుస్తోంది.
ఇప్పటి
వరకు
ఈ
మార్గంలో
ఏపీ
374
బస్సులను
నడుతుండగా,
తాజా
నిబంధనల
ప్రకారం
వాటి
సంఖ్య
192కి
తగ్గించుకోబోతున్నారు.
తెలంగాణ
బస్సులు
ఇప్పటి
వరకూ
ఈ
రూట్
లో
కేవలం
162మాత్రమే
తిరిగేవి.
కొత్త
అవగాహన
ప్రకారం
ఇకపై
ఆ
సంఖ్య
273కి
పెరుగుతుంది.
కర్నూల్
సెక్టార్
లో
25వేలు,
భద్రాచలం
సెక్టార్
లో
13వేల
కిలోమీటర్ల
మేర
ఏపీ
బస్సు
సర్వీసుల్ని
తగ్గించుకుంటోంది.
నూతన
అవగాహనతో
ఏపీఎస్ఆర్టీసీకి
భారీ
నష్టం
చేకూరుతుంది.
అయినా
కూడా
రెండు
తెలుగు
రాష్ట్రాల
ప్రయాణికుల
ఇబ్బందుల్ని
దృష్టిలో
ఉంచుకుని
ఏపీ
వెనక్కు
తగ్గినట్టు
అధికారులు
స్పష్టం
చేస్తున్నారు.
ఫలప్రదం దిశగా చర్చలు.. వీలైతే రేపటినుండి బస్సులు తిరిగే అవకాశం..
ఇదిలా
ఉండగా
ప్రతి
సంవత్సరం
270
కోట్ల
రూపాయలు
ఏపీఎస్ఆర్టీసీకి
నష్టం
వస్తుందని
అంచనా.
ఈమేరకు
తెలంగాణ
ఆర్టీసీకి
లాభం
చేకూరే
అవకాశాలు
ఉన్నట్టు
అధికారులు
అంచనా
వేస్తున్నారు.
తాము
బస్సుల
సంఖ్య
తగ్గించుకునే
ప్రసక్తే
లేదని,
కావాలంటే
తెలంగాణ
ఆర్టీసీ
బస్సుల
సంఖ్య
పెంచుకోవచ్చని
ఇప్పటి
వరకూ
ఏపీ
ప్రభుత్వం
వాదిస్తూ
వచ్చింది.
కాని
ఈ
ప్రతిపాదనకు
తెలంగాణ
అధికారుల
నుండి
సానుకూల
స్పందన
రాలేదు.
దీంతో
తెలంగాణ
ప్రతిపాదనలకే
ఆమోదం
తెలపాలని
ఏపీ
నిర్ణయం
తీసుకుంది.
కొత్త
నిబంధనలతో
వచ్చే
నష్టాన్ని
భర్తీ
చేసుకునేందుకు
ప్రత్యామ్నాయ
మార్గాల
ద్వారా
ఆదాయం
పెంచుకునే
అవకాశాలను
ఏపీ
ప్రభుత్వం
పరిశీలిస్తోంది.