వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహలు: ఎర్రచందనం కూలీలే

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఏడు మృతదేహలు దొరకడం స్థానికంగా కలకలాన్ని రేపుతోంది.మృతులంతా ఎర్రచందనం కూలీలగా పోలీసులు గుర్తించారు. శవాలనుచెరువు నుండి పోలీసులు వెలికి తీశారు.

కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఉదయం పూట ఏడు మృతదేహలు నీటిలో తేలియాడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు.

seven dead bodies at Vontimitta lake in Kadapa district

కడప జిల్లా రేణుగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు.

seven dead bodies at Vontimitta lake in Kadapa district

చెరువులో పడి మరికొందరు గల్లంతైనట్లు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం పోలీసులు ఈ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు.

దీంతో పోలీసులను చూసిన ఎర్రచందనం కూలీలు వారి నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.మృతుల బ్యాగుల్లోని వస్తువుల ద్వారా మృతుల వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.

English summary
seven dead bodies found at vontimitta lake in Kadapa district on Sunday. police registered a case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X