స్టూడెంట్స్ పై హెడ్ మాస్టర్ సెక్సువల్ వేధింపులు, ఏడేళ్ల జైలు
కృష్ణాజిల్లా : విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఓ హెడ్ మాస్టర్ దారి తప్పాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. చివరికి విషయం బయటకు పొక్కి.. కోర్టు దాకా వెళ్లడంతో సదరు హెడ్ మాస్టర్ ఊచలు లెక్కపెట్టబోతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం, ముత్రాసిపాలెం మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తోన్న ఓ హెడ్ మాస్టర్ గతేడాది సెప్టెంబర్ 9న 5వ తరగతి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంతో.. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో ఇంతకాలం విచారణ జరుగుతున్న వస్తోన్న కేసు సోమవారం నాడు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడైన హెడ్ మాస్టర్ కు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ స్థానిక ప్రోక్సో స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.9 లక్షల జరిమాన కూడా విధించింది కోర్టు.