వ్యభిచార ముఠా గుట్టురట్టు: యువతుల విముక్తి
విశాఖపట్నం: నగరంలోవ్యభిచార ముఠా గుట్టు రట్టయిది. పీఎం పాలెం ఏరియాలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఒక వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. వ్యభిచార ముఠాను నిర్వహిస్తోన్న పీఎం పాలెంకు చెందిన మనోహర్ అనే వ్యక్తితోపాటు రుమా ఖాన్, ఇద్రిస్ ఆలీ, ఆల్ అమీన్ను అరెస్టు చేశారు.
ముఠా బారి నుంచి నలుగురు పశ్చిమబెంగాల్కు చెందిన యువతులకు విముక్తి కల్పించారు. తమను విశాఖ సైట్ సీయింగ్కని తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపారని బాధిత మహిళలు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.
వృద్ధ దంపతుల ఆత్మహత్య
చిత్తూరు: కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎస్. శాంతంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. శాంతంపల్లిలో కామసముద్రం మునప్ప(70), నారాయణమ్మ(65) దంపతులు తమ పిల్లలకు దూరంగా గ్రామంలోని పొలాల్లో ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నారు.
కాగా, ఇరువరి మధ్య ఇటీవల చిన్న తగదా చోటు చేసుకుంది. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన నారాయణమ్మ శుక్రవారం ఉదయం భర్తలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఇంటికి చేరిన మునప్ప... విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి... ఆమెను చూసి ఆవేదనకుక గురయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణమ్మ రాత్రి మృతి చెందారు.