వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కాకినాడ ఎంపీ పీఏ లైంగిక వేధింపులు' : మహిళ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

కాకినాడ : తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం పీఏ శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. దీంతో కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్లు 354, 509, 506 ప్రకారం ఎంపీ పీఏ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రాయుడు పాలెంలోని ఓ అద్దె ఇంట్లో ఉన్న మహిళను పీఏ శర్మ వేధింపులకు గురిచేస్తున్నాడు. తను అద్దెకు ఉంటున్న ఇల్లు పీఏ శర్మ స్నేహితుడిది కావడంతో.. ఇల్లు ఖాళీ చేయాలని శర్మ తనపై ఒత్తిడి తెస్తున్నాడని, ఇదే క్రమంలో తనపై రకరకాలుగా వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది.

Sexual harassement case on Kakinada MPS PA

పోలీసులు కూడా తొలుత తన ఫిర్యాదు పట్ల స్పందించలేదని ఆరోపించిన మహిళ, ఆ తర్వాత కేసు నమోదు చేసినట్లుగా తెలిపింది. అయితే సదరు మహిళ పెట్టిన కేసుపై స్పందించేందుకు నిరాకరించారు సర్పవరం పోలీసులు. అటు పీఏ శర్మ కూడా కేసుపై ఇంతవరకు స్పందించలేదు. తన సోదరి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, కాబట్టి ప్రస్తుతానికి కేసుపై తానేమి మాట్లాడనని వివరించారు పీఏ శర్మ

English summary
A Woman filed complainted on a politician PA for sexual harassement. Through this Kakinada Rural police registered the case against PA sharma who is working for MP Thota Narasimham
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X