ఏపీ ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన .. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్ట్ లతో ఉద్రిక్తత
ఏపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చంద్రబాబు క్యాబినెట్ భేటీకి ఇంకా రాని ఈసీ అనుమతి .. సీఎంను కలవనున్న సీఎస్ .. ఏపీలో ఉత్కంఠ
ఏపీలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు వేసవిలో కూడా ఇష్టానుసారం క్లాసులు నిర్వహించడంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన వారిని అధికారాలను కలవనీకుండా పోలీసులు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఎస్ఎఫ్ఐ నేతలు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వేసవి సెలవుల సమయంలో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కార్పోరేట్ కళాశాలల విషయంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు.