వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజన చంద్రబాబు వల్లే: శైలజానాథ్, హోదాపై ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు/ గుంటూరు : రాష్ట్ర విభజనకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ముఖ్య కారణమని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భిక్షం వేయాలని అడగడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీనే నెరవేర్చాలంటున్నామని ఆయన అన్నారు. ఈనెల 8న తిరుపతిలో జరుగనున్న పోరుసభ వాల్‌పోస్టర్‌ను శైలజానాథ్‌ విడుదల చేశారు.

Shailajanath blames Chandrababu for AP bifurcation

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈనెల 10వ తేదీ లోపు ప్రత్యేక హోదా ప్రకటించాలని రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈలోగా ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరాకపోతే 11వ తేదీన ఏపీ బంద్‌ నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh Congress leader Shailajanath blamed AP CM and Telugu Desam party president Nara Chandrababu Naidu for the bifurcation of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X