వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నోట్‌పై షిండే నీళ్లు: చర్చ ఊహాగానాలే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ నోట్ గురువారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుందనే వార్తలపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నీళ్లు చల్లారు. తెలంగాణ నోట్‌పై మంత్రివర్గంలో చర్చ జరుగుతుందనే వార్తలు ఊహాగానాలేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు

ఎకె ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఆయన చెప్పారు. కేబినెట్ నోట్, మంత్రివర్గంలో చర్చపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని ఆయన చెప్పారు. నోట్ సిద్ధమైన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే అది యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ వద్దకు వెళ్లలేదని, దానిపై తాను సంతకం చేయలేదని ఆయన చెప్పారు.

తెలంగాణ నోట్‌పై సాయంత్రం కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సుశీల్ కుమార్ షిండేను కలిశారు. తాము నోట్‌ను వ్యతిరేకిస్తామని ఆయన షిండేకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ నోట్‌పై మంత్రివర్గం చర్చిస్తుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్రంలో వేడి పుట్టింది.

ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావును కలిశారు. ఇటు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు హైదరాబాదులో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

English summary
Union home minister Sushil kumar Shinde denied reports about the Telangana note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X