సొంత నియోజకవర్గంలో కిరణ్కు జగన్ పార్టీ 'పెద్ది' షాక్
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. ఇటీవల పరోక్ష ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ రెండు ఎంపీపీలను గెలుచుకుంది. అయితే, ఆ ఆనందం జై సమైక్యాంధ్ర పార్టీకి ఒక్క రోజులోనే ఆవిరి అయిపోయింది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలో జై సమైక్యాంధ్ర పార్టీ మండలాధ్యక్ష స్థానాన్ని సొంత బలంతో దక్కించుకుంది. అలాగే అదే నియోజకవర్గంలోని గుర్రంకొండ మండల అధ్యక్ష స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో గెలుచుకుంది.
తమ సభ్యుల మద్దతుతో జై సమైక్యాంధ్ర పార్టీకి అధ్యక్ష పదవి ఇచ్చి, తాము ఉపాధ్యక్ష పదవి తీసుకునేలా ఆ పార్టీ నేతలతో ఎన్నికకు ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడైన నక్కా చంద్రశేఖర్కు ఎంపీపీ పదవి దక్కింది. పదవి దక్కించుకున్న చంద్రశేఖర్ ఆదివారం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.