వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఎంపీ విజయసాయి రెడ్డి

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR కాళ్ళు మొక్కిన విజయసాయి రెడ్డి...!!! || Oneindia Telugu

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన జగన్ దంపతులకు సాదర స్వాగతం పలికారు కేసీఆర్. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి ,రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. మానుకోటలో జగన్ ను రానివ్వకుండా రాళ్ళ దాడి చేసిన ఘటన మరచి జగన్ , కేసీఆర్ లు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే ఇక విజయసాయిరెడ్డి చేసిన పని అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

మొదట నుండీ వైసీపీలో ఏ 2 గా చెప్పబడే విజయసాయిరెడ్డి జగన్ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇక జగన్ కేసీఆర్ ను కలిసిన సమయంలో విజయసాయి రెడ్డి , మిథున్ రెడ్డి లను కేసీఆర్ కు పరిచయం చేశారు. కేసీఆర్ విజయసాయి రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన కృషిని ప్రశంసించారు. దాంతో విజయసాయి రెడ్డి కేసీఆర్ పాదాలకు మొక్కాడు. అక్కడ వున్న వారు ఎవరూ పెద్దగా స్పందించలేదు కానీ ఆ దృశ్యాన్ని టెలివిజన్ లలో చూసిన వీక్షకులు మాత్రం అవాక్కయ్యారు.

రాజ‌ధాని స్కాం బ‌య‌ట‌కు తెస్తాం, పోల‌వ‌రంలో అవ‌స‌ర‌మైతే రీటెండ‌ర్లు: జ‌గ‌న్‌రాజ‌ధాని స్కాం బ‌య‌ట‌కు తెస్తాం, పోల‌వ‌రంలో అవ‌స‌ర‌మైతే రీటెండ‌ర్లు: జ‌గ‌న్‌

Shocking ... MP Vijayasai reddy touched the feet of Telangana CM KCR

వైసీపీలో కీలక నాయకుడు, సీనియర్, జగన్ తర్వాత ముఖ్య నాయకుడు, ఎంపీ ఈ విధంగా పక్క రాష్ట్ర సీఎం కాళ్ళు మొక్కటం ఆంధ్ర ప్రదేశ్ ఆత్మాభిమానాన్ని కించపరచటమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా పనులు కరెక్ట్ కాదని వారు భావిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ భేటీలో ఖమ్మం వైసీపీ నుండి గెలిచి టీఆర్ ఎస్ కు పార్టీ ఫిరాయించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

English summary
YS Jagan Mohan Reddy has met Telangana CM KCR at Pragathi Bhavan for the first time. Jagan received a grand welcome from KCR and Jagan was accompanied by his wife, Rajya Sabha MP Vijayasai Reddy and others.After welcoming Jagan, KCR took him inside the Pragathi Bhavan and in a special room, he introduced his ministers to Jagan. After this is done, Jagan had introduced Vijayasai Reddy and Rajampeta MP Midhun Reddy. Just when KCR was about to greet Vijayasai, the YSRCP leader bowed down to touch KCR's feet. Though none of the politicians present there reacted, it was quite shocking for the Telugu people who have watched it on the television. Later KCR offer sweet to Jagan on the grand victory in the Andhra Pradesh elections. Interestingly in this very meeting former Khammam MP Ponguleti Srinivas Reddy was also present. In 2014 elections, he won on behalf of YSRCP and later defected to TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X