'శిల్పా సొసైటీ పేరుతొ సొంతగా కార్యక్రమాలు, ఆ పద్ధతి వైసిపిలో లేదు'
నంద్యాలలో వైసిపి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాల్గొననున్నారు.
నంద్యాల: నంద్యాలలో వైసిపి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే బహిరంగ సభలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకుంటారు.
జగన్! వారికి నేనున్నా: బ్రహ్మానందరెడ్డి, అఖిల కంటతడి, చూపిస్తా: చక్రపాణి రెడ్డి హెచ్చరిక
ఎస్పీజీ మైదానంలో బహిరంగ సభ
ఎస్పీజీ మైదానంలో ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు పార్టీ నేత బొత్స సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మూడేళ్లు నంద్యాల గురించి పట్టించుకోని టిడిపి నాయకులు ఉప ఎన్నికల నేపథ్యంలో దొంగ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video
శిల్పా సొసైటీ పేరుతో..
శిల్పా సొసైటీ పేరుతో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని బొత్స చెప్పారు. వైసిపి ఎప్పుడూ ప్రజలకు హామీ ఇస్తుందే, తప్ప నాయకులకు హామీ ఇవ్వదని వ్యాఖ్యానించారు.
ఆ పద్ధతి వైసిపిలో లేదు
అంబటి రాంబాబు మాట్లాడుతూ... డబ్బులు, పదవులు ఇచ్చి నాయకులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం టిడిపిలోనే జరుగుతుందని విమర్శించారు. వైసిపిలో ఆ పద్ధతి ఉండదని చెప్పారు. జగన్ను చూసి అందరూ పార్టీలో చేరుతున్నారన్నారు.
అధికార దుర్వినియోగం అంటూ
ఇదిలా ఉండగా, ఏపీలో నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం వినియోగిస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటి ఆరోపించింది. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.