శ్రీసుందరరాజస్వామికి హైదరాబాద్ భక్తుడు వెండి ఆభరణాల వితరణ(పిక్చర్స్)
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో కొలువుదీరిన శ్రీసుందరరాజస్వామికి అలంకరించేందుకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు వెండి ఆభరణాలను బుధవారం కానుకగా అందించారు.
శ్రీ సుందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, బలరామకృష్ణుడు మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, పాటు తాయారు అమ్మవారికి అలకరించేందుకు వీలుగా వెండి కిరీటం, కర్ణాభరణాలు, అభయహస్తాలు, శంఖుచక్రాలు, వెండి కవచం, కిరీటం, అభిషేకానికి వినియోగించేందుకు వెండితో తయారు చేసిన శంఖులను హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త పేరిరెడ్డి ప్రత్యేకంగా 30 కిలోల వెండితో తయారు చేయించారు.
వెండి ఆభరణాలను ఆలయంలో ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో చెంచులక్ష్మీ, పేష్కార్ రాధాకృష్ణకు దాత తన కుటుంబసభ్యులతో కలిసి అందించారు. ఈ ఆభరణాల ఖరీదు రూ.16 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. అనంతరం దాత కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలు అందించారు.
వెండి ఆభరణాల వితరణ
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో కొలువుదీరిన శ్రీసుందరరాజస్వామికి అలంకరించేందుకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు వెండి ఆభరణాలను బుధవారం కానుకగా అందించారు.
వెండి ఆభరణాల వితరణ
శ్రీ సుందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, బలరామకృష్ణుడు మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, పాటు తాయారు అమ్మవారికి అలకరించేందుకు వీలుగా వెండి కిరీటం, కర్ణాభరణాలు, అభయహస్తాలు, శంఖుచక్రాలు, వెండి కవచం, కిరీటం, అభిషేకానికి వినియోగించేందుకు వెండితో తయారు చేసిన శంఖులను హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త పేరిరెడ్డి ప్రత్యేకంగా 30 కిలోల వెండితో తయారు చేయించారు.
వెండి ఆభరణాల వితరణ
వెండి ఆభరణాలను ఆలయంలో ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో చెంచులక్ష్మీ, పేష్కార్ రాధాకృష్ణకు దాత తన కుటుంబసభ్యులతో కలిసి అందించారు. ఈ ఆభరణాల ఖరీదు రూ.16 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు.
వెండి ఆభరణాల వితరణ
అనంతరం దాత కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రవి, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఆర్జితం ఇన్స్పెక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.