గిఫ్ట్:3విద్యాసంస్థలు ఒకేచోట, బాబుపై స్మృతి(పిక్చర్స్)
చిత్తూరు: దేశం గర్వించేవిధంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్దిశాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపం శ్రీనివాసపురంలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్మృతి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి చేయాలన్నారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. అట్టడుగువర్గాలు అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ఆంకాంక్ష అన్నారు. పేద విద్యార్థులు సైతం అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు సంకల్పమే కాదని మోడీ, వెంకయ్యనాయుడులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడమేనన్నారు.
విద్యా విధానంలో ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ, వెంకయ్యల సహకారంతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. భావి అవసరాలకు మరిన్ని విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతామన్నారు.
విద్యాసంస్థలు
దేశం గర్వించేవిధంగా విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్దిశాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం పిలుపునిచ్చారు.
విద్యాసంస్థలు
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపం శ్రీనివాసపురంలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
విద్యాసంస్థలు
ఈ సందర్భంగా స్మృతి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి చేయాలన్నారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు.
విద్యాసంస్థలు
అట్టడుగువర్గాలు అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తమ ఆంకాంక్ష అన్నారు. పేద విద్యార్థులు సైతం అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
విద్యాసంస్థలు
విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు సంకల్పమే కాదని మోడీ, వెంకయ్యనాయుడులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడమేనన్నారు.
విద్యాసంస్థలు
విద్యా విధానంలో ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ, వెంకయ్యల సహకారంతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. భావి అవసరాలకు మరిన్ని విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతామన్నారు.
విద్యాసంస్థలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీ కష్టాల్లో ఉందని, అనేక సమస్యలు కళ్లముందున్నాయన్నారు.
విద్యాసంస్థలు
మూడు అత్యున్నత విద్యాసంస్థలు ఒకేచోట ఏర్పాటు కావడం అపూర్వ ఘట్టమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మోడీ, చంద్రబాబు సారథ్యంలో కేంద్ర, రాష్ట్రాలు మరింత పరుగు తీస్తాయన్నారు. వంద స్మార్ట్ సిటీలకు శ్రీకారం చుట్టామన్నారు.
విద్యాసంస్థలు
విశాఖపట్నం, తిరుపతి, నూతన రాజధాని ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు తీయాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా అందులో తెలుగు వారు ఉండాలనేది తన కోరిక అన్నారు. అనంతపురానికి చెందిన సత్యన నాదెళ్ల నేడు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారని, ఇది తెలుగు వారికి గర్వకారణమన్నారు.