ఇప్పటి వరకు ఆశయం కోసం పనిచేశాను...ఇక రాజకీయాలు చేస్తాను : పవన్ కాళ్యాణ్
ఇప్పటి వరకు తన అశయాలకు అనుగుణంగానే ఎన్నికల్లో పోరాడానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...ఇక భవిష్యత్లో ఆశయాలతోపాటు రాజకీయ ఎత్తుగడలను వేస్తానని చెప్పారు. ఇన్నాళ్లు రాజకీయ కుట్రలు చేయలేక కాదని, పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుగుణంగా పార్టీని నడపడానికే మొగ్గు చూపానని అన్నారు. ఈ సంధర్భంగా తాను విలువల కోసం నిలబడతానిని అన్నారు. తన పోరాటం పరిస్థితుల్లో మార్పు వచ్చే వరకు కొనసాగుతుందని అన్నారు.
ఇలాంటీ నేపథ్యంలోనే శ్రీకాకుళంలో వలసలు ఆగి ప్రజల్లో మార్పు వచ్చే రాజకీయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.మారుతున్న పరిణా మాలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్షేత్ర స్థాయిలో జనం సమస్యలపై సమగ్ర అవ గాహన పెంచుకోవాలని పవన్ సూచించారు.జనసేన పార్టీ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ నేతలకు సూచించారు.
రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇద్దామని ఆయన తెలిపారు. పంచాయతీ, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు దీటుగా అభ్యర్థులను నిలుపుదామని ఆయన వివరించారు. తాను పార్టీ కార్యాలయంలోనే అందరికీ అందుబాట్లో ఉంటానని, నాయకులు ఎప్పుడైనా తనను కలవవచ్చని ఆయన తెలిపారు.కాగా ఫలితాలపై వివిధ జిల్లాల నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే...