నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలు వారంగా మార్చారు: జగన్మోహన్ రెడ్డిపై గోరంట్ల సెటైర్లు

|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే.. ప్రతిపక్ష నేత జగన్‌ శుక్రవారాన్ని జైలువారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

అంతేగాక, వీరిద్దరి మధ్య ఈ తేడాను నంద్యాల, కాకినాడ ఓటర్లు గమనించాలని గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 విజయసాయిరెడ్డి, లిక్కర్‌ మాఫియా బొత్స సత్యనారాయణ, మైనింగ్‌ మాఫియా ధర్మాన ప్రసాదరావు కాకినాడ వచ్చి గూండాగిరి చేస్తుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు.

so many difference between chandrababu and ys jagan, says gorantla

కాకినాడ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని గోరంట్ల అన్నారు. అన్ని ఫెడరేషన్లకు నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తమదే గెలుపు అని స్పష్టం చేశారు.

English summary
TDP senior leader Gorantla Buchaiah chowary on Sunday said that so many differences between Andhra Pradesh CM Chandrababu Naidu and YSRCP president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X