జగన్ కోసమే, వారొద్దంటే మీరే కలుస్తామంటారా?: శోభా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని, అలాంటి వ్యక్తి విభజనకు సహకరించడం దారుణమన్నారు. బాబు పాలనలో ప్రాజెక్టులు పూర్తయితే తీర్పు బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు ఇలా వచ్చేది కాదన్నారు. మన ఐక్యత వల్లనే ట్రైబ్యునల్ తీర్పులో నష్టం జరిగిందన్నారు.
రాయల తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని పార్టీలకు చెందిన సీమ నేతలు నడుం కట్టాలన్నారు. సమైక్యాంధ్రలో సీమ ప్రాంతానికే అన్యాయం జరిగిందని, ఇప్పుడు విభజన ద్వారా శాశ్వతంగా నష్టపోతుందన్నారు. రాయల తెలంగాణకు తెలంగాణ నేతలు నో చెబుతుంటే కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలే అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఒక్కో నినాదంతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
స్వార్థంతోనే రాయల తెలంగాణ: ఈటెల
కొందరు సీమాంధ్ర ప్రాంత నేతలు స్వార్థంతోనే రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ కరీంనగర్లో అన్నారు. రాయల టికి ఇరు ప్రాంత ప్రజలు ఒప్పుకోరన్నారు.