వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శోభా నాగిరెడ్డి గెలుపు కోసం కూతురు అఖిల రోడ్డు షో

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: దివంగత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డిని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని శోభా కూతురు భూమా అఖిలప్రియ కోరుతున్నారు. తన అమ్మ శోభను గెలిపించాలంటూ ఆమె రోడ్డు షో నిర్వహిస్తున్నారు.

అమ్మను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం మండలంలోని భాగ్యనగరం, కొండాపురం, రామచంద్రాపురం, దొర్నిపాడు, అమ్మిరెడ్డినగరం, అర్జునాపురం గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు.

Sobha Nagireddy daughter campaign for Sobha's win

కొండాపురం గ్రామంలోలో ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమె తపించేవారన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి శోభా నాగిరెడ్డి ఎంతో కృషి చేశారని భూమా నారాయణ రెడ్డి అన్నారు. భారీ మెజార్టీతో ఆమెను గెలిపించి రుణం తీర్చుకుందామన్నారు.

కాగా, శోభా నాగిరెడ్డి ఆరు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీ నాయకురాలు షర్మిల ప్రచారంలో పాల్గొన్న ఆమె రాత్రి పదకొండు గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా.. ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారు. ఆళ్లగడ్డలో ఎన్నికలు నిర్వహిస్తామని, శోభా గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి ప్రకటించింది.

English summary
Sobha Nagireddy daughter campaign for Sobha's win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X