సూర్యగ్రహణం: కాకినాడలో మరో దారుణం.. మహిళపై మూకదాడి.. ఉద్రిక్తత..
సూర్యగ్రహణం రోజున ఏం చెయ్యాలి? ఏవి చెయ్యకూడదు? అనే భిన్నవాదనలతోపాటు మూఢనమ్మకాలకు సంబంధించిన ఘటనలూ అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కర్నాటకలో తల్లిదండ్రులే పిల్లల్ని పీకల్లోతు మట్టిలో పూడ్చిపెట్టిన వీడియోలు వైరలైన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతున్నది.
ఒకటిన్నర
చావుకు
ఆమె
కారణం..
సూర్యగ్రహణం
కొనసాగుతున్న
సమయంలోనే..
కాకినాడ
శివారులోని
ఓ
గ్రామంలో
పాపమ్మ
అనే
మహిళపై
స్థానికులు
మూకదాడి
చేశారు.
పాపమ్మకు
చేతబడి
మంత్రాలు
వచ్చని,
ఆమె
వల్ల
గ్రామంలో
భయాందోళనలు
చెలరేగుతున్నాయని,
ఆమె
చేతబడి
చేయడం
వల్లే
గ్రామంలో
సత్యనారాయణ
అనే
వ్యక్తి
చనిపోయాడని,
పాపమ్మతో
మాట్లాడిన
కొద్దిసేపటికే
గ్రామానికి
చెందిన
మరో
యువతి
ఆత్మహత్యాయత్నం
చేసిందని
గ్రామస్తులు
ఆరోపించారు.
ఊరంతా
ఒక్కటై
దాడి
చేశారు..
గ్రామంలో
చోటుచేసుకుంటున్న
సంఘటనలకు
కారణం
పాపమ్మ
మంత్రాలేనని
నిర్ధారించుకున్న
స్థానికులు..
ఆమెపై
దాడికి
ప్లాన్
చేశారు.
బాధితుల
కుటుంబాలతోపాటు
ఊరందరినీ
ఒక్కటిచేసి..
ఆమె
ఇంటిపై
మూకదాడికి
పాల్పడ్డారు.
దాడి
చయడమేకాక
పాపమ్మ
ఇంటిని
కూడా
స్థానికులు
ధ్వంసం
చేశారు.
దీంతో
గ్రామంలో
ఉద్రిక్త
పరిస్థితులు
ఏర్పడ్డాయి.
ఈ
ఘటనపై
పోలీసులుగానీ,
ప్రభుత్వాధికారులుగానీ
ఇంకా
స్పందించలేదు.