సమస్యలు: జగన్తో ఇరిగేషన్ ఇంజినీర్ల భేటీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ఇంజినీర్లు సోమవారం భేటీ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారు తమ సమస్యలను తెలియజేశారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు పోస్టింగులు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఇంజినీర్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని వారు వాపోయారు.

తమకు ఏ రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంజినీర్లు తెలిపారు. తమ సమస్యను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని ఇంజినీర్లు కోరారు.
జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఇంజినీర్లు మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications