సమస్యలు: జగన్తో ఇరిగేషన్ ఇంజినీర్ల భేటీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ఇంజినీర్లు సోమవారం భేటీ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారు తమ సమస్యలను తెలియజేశారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు పోస్టింగులు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఇంజినీర్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మూడు నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని వారు వాపోయారు.

తమకు ఏ రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంజినీర్లు తెలిపారు. తమ సమస్యను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని ఇంజినీర్లు కోరారు.
జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం ఇంజినీర్లు మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications