సంతాపం: కన్నీరుమున్నీరైన శోభ ఫ్యామిలీ (పిక్చర్స్)
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ఓదార్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, కాంగ్రెస్ పార్టీ నేత రేణుకా చౌదరి, మాజీ డిజిపి దినేష్ రెడ్డి, సినీ నిర్మాత అల్లు అరవింద్, సినీ నటులు రాజశేఖర్, జీవితా, మంచు మనోజ్, లక్ష్మిలతోపాటు పలువురు నాయకులు శోభ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
శోభా నాగిరెడ్డి భౌతికకాయాన్ని ఆళ్లగడ్డకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రేణుకా చౌదరి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆస్పత్రి వద్ద రేణుకా చౌదరి, జయప్రకాష్ నారాయణ.
మంచు లక్ష్మీ ఓదార్పు
కేర్ ఆస్పత్రి వద్ద శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న సినీ నటి మంచు లక్ష్మీ.
మంచు మనోజ్, రాజశేఖర్
శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. భూమానాగి రెడ్డికి సానుభూతి తెలుపుతున్న రాజశేఖర్, మంచు మనోజ్.
విషాదంలో కుటుంబం
శోభా నాగిరెడ్డి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
మాజీ డిజిపి దినేష్ రెడ్డి
శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆస్పత్రికి చేరుకున్న మాజీ డిజిపి దినేష్ రెడ్డి.
కన్నీటి పర్యాంతమైన భూమన
శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. శోభ మృతితో కన్నీరుమున్నీరవుతున్న ఆమె భర్త భూమా నాగిరెడ్డి.
ఓదారుస్తున్న మంచు మనోజ్
శోభా నాగిరెడ్డి భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. శోభా నాగిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మంచు మనోజ్.