బాణానికి ఎవరడ్డొస్తారో చూస్తాం, జగన్ సిద్దమా: సోమిరెడ్డి
చంద్రబాబుకు రెండువేల కోట్లు ఉన్నాయని తెహెల్కా అసత్య ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. తెహెల్కాలో షేర్లు ఉన్న తేజ్పాల్, కాంగ్రెసు నేతల పైన సిబిఐ విచారణ జరిపించాలన్నారు. తెహెల్కా వెనుక కాంగ్రెసు పార్టీ ఉందని ఆరోపించారు. ప్రత్యర్థులను అవినీతిపరులుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెసు పార్టీ ఉపయోగించుకుంటోందన్నారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ను కుట్రపూరితంగా ఇరికించారన్నారు. అవినీతి, అక్రమాలపై తాము చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైయస్ జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరైనా చర్చకు రావొచ్చునన్నారు.
తమకు సంబంధించిన ప్రతి ఆస్తిని చూపిస్తామన్నారు. ప్రజలు, మీడియా సహా ఎవరు వచ్చినా సరే బాబు ఆస్తులు చూపించేందుకు సిద్ధమన్నారు. ఆ తర్వాత తమ పార్టీ అధ్యక్షులు రామబాణం వదులుతారని, ఎవరు అడ్డొస్తారో చూస్తామన్నారు.