‘అతడు’ సినిమాలోలానే ప్లాన్: ‘జగన్పై దాడి’పై సోమిరెడ్డి, ‘పిల్లాడితో చంపిస్తామా?’
అమరావతి: తెలుగుదేశం పార్టీకి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును నిందించడంపై ఆయన మండిపడ్డారు.
‘అతడు’ సినిమాలోలానే జగన్పై దాడి ప్లాన్..
‘అతడు' సినిమాలో సానుభూతి కోసం ఓ నేత తనపై తాను హత్యాయత్నానికి ఎలా ప్లాన్ వేసుకున్నాడో.. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసమే తనపై తాను దాడి చేయించుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దాడి చేసిన శ్రీనివాస్ కూడా సానుభూతి కోసమే దాడి చేశానని చెబుతున్నాడని చెప్పారు.
జగన్పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, ‘తక్కువ అంచనావేయొద్దు'
పిల్లాడిని అడ్డంపెట్టుకుని చంపాలని అనుకుంటామా?
జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పోలీసులను మాత్రమే నమ్ముతారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. పిల్లాడిన అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని చంపాలని అనుకుంటామా? అని అన్నారు. జగన్ని హత్య చేసి తాము రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు.
‘జగన్కు కేసీఆర్ ఫోన్ చేస్తే అంత తత్తరపాటేందుకు చంద్రబాబూ-మనిషివేనా?'
హత్యా రాజకీయాలు అలవాటు లేదు
ఇప్పటి వరకు హత్యలు చేసే సీఎం అయ్యామా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు తమకు అలవాటు లేవని, అవన్నీ వైయస్ కుటుంబానివేనని అన్నారు. హత్యలు చేసి అధికారంలోకి రావడం తమకు తెలియదన్నారు.
చంద్రబాబును ముద్దాయి అంటారా?
ప్రధాని నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని ఏపీలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. తమిళనాడులో, కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చూశామని అన్నారు. జగన్పై ఎవరో దాడి చేస్తే చంద్రబాబును ముద్దాయిని చేయండని వైసీపీ వాళ్లంటున్నారని, బీజేపీ వాళ్లేమో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని అంటున్నారని మండిపడ్డారు.