వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: బ‌తికివుండ‌గానే కన్న త‌ల్లిని శ్మ‌శానంలో వ‌దిలేసిన తనయుడు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మానవత్వం దిగజారిపోతోంది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని కన్న కొడుకే బతికుండగా శ్మశానంలో వదిలివెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... అమలాపురం మండలంలోని పేరూరు గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతరావు అనే వ్యక్తి తన తల్లి సత్యవతి (75)ని వృద్ధాశ్రమంలో వదలి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు వృద్ధాశ్రమాల్లో అనుమతి నిరాకరించడంతో ఆమెను నిర్ధాక్షణ్యంగా శ్మశానంలో వదిలి వెళ్లిపోయాడు.

Son discards his mother at cemetery in east godavari

దీంతో శ్మశాన వాటికలో నీరసంగా ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు ఆమె గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అమలాపురం ఎస్‌ఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వృద్ధురాలిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు.

English summary
Son discards his mother at cemetery in east godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X