వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసాయి కొడుకు .. తండ్రి గొంతుపై కాలితో తొక్కి హతమార్చిన తనయుడు; పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

|
Google Oneindia TeluguNews

సమాజంలో మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు అర్ధం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కన్న కొడుకును పెంచుకున్న, అడిగినవన్నీ ఇచ్చి పెద్ద చేసిన తండ్రినే కాటికి పంపిస్తున్న కసాయి తనయుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. రోజు రోజుకి నేరప్రవృత్తి మానవ సమాజంలో రాజ్యమేలుతుంది. ఎక్కడ చూసినా దారుణాలు, హింసాత్మక ఘటనలు అడ్డూ అదుపు లేకుండా చోటుచేసుకుంటున్నాయి. రక్త సంబంధాలను కూడా మరిచి చిన్న చిన్న విషయాలకే దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం ఆందోళనకరంగా మారాయి.

200 రూపాయల కోసం తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు .. కొత్తగూడెంలో దారుణం200 రూపాయల కోసం తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు .. కొత్తగూడెంలో దారుణం

మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో కేవలం రెండు వందల రూపాయలు అడిగితే ఇవ్వలేదని తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ తనయుడు. మంచిర్యాల జిల్లాలో భూమి కోసం తండ్రిని గెంటేశాడో కొడుకు. ఇక ఈ ఘటన మరచిపోక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం సౌత్ పేరుపాలెంలో జరిగిన ఈ దారుణంలో 60 సంవత్సరాల వయసున్న తండ్రి ఉల్లంపర్తి గొంతుపై కొడుకు లాజరస్ కాలితో తొక్కి అత్యంత పాశవికంగా హతమార్చాడు.

son killed father for property in west godavari district

లాజరస్ గత కొంత కాలంగా తండ్రితో ఆస్తి విషయంలో గొడవ పడుతున్నాడు. ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వొద్దని తండ్రితో గొడవ పడుతున్న లాజరస్ తండ్రి ఆస్తిని తన సోదరీలకు కూడా పంచుతారని అనుమానంతో లాజరస్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం పెరిగిపోయ్తున్నాయి. బంధాల కంటే డబ్బు, ఆస్తులే ప్రధానం అనుకుంటున్న సంతానం మానవత్వం మరచి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.

Recommended Video

Mythology : History Of Kumara Swamy, What Is The Puja To Be Done | Oneindia Telugu

తల్లి దండ్రులను ఆస్తుల కోసం కడ తేర్చటం, ఆస్తుల కోసం తల్లి దండ్రులను తిండి కూడా పెట్టకుండా వేధించటం, ఇంట్లో నుండి బయటకు గెంటేయటం నిత్య కృత్యంగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిణామాలు సమాజంలో ఒక హానికరమైన వాతావరణానికి కారణంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రుల పట్ల పిల్లలు చూపిస్తున్న కర్కశత్వం ప్రస్తుతం అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది.

English summary
A 60-year-old father, was brutally stabbed to death by his son Lazarus in West Godavari district. Lazarus shunned the atrocity on suspicion that the father would distribute the property to his sisters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X