కామాంధుండంటే వీడే...కన్నతల్లినే చెరిచి...చంపేసి...చెల్లిని కూడా...చిత్తూరు జిల్లాలో దారుణం
చిత్తూరు : కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే అక్షరాలా నిరూపించాడో నీచుడు...మనిషనేవాడు కల్లో కూడా ఊహించని దారుణానికి ఒడిగట్టాడు...మదమెక్కిన మానవ మృగం లాంటి ఓ దుర్మార్గుడు కన్నతల్లి పైనే అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమెని కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా వి.కోట మండలం శివుని కుప్పంలో మంగళవారం జరిగిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కన్నతల్లి నే అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు.
దీన్ని గమనించిన స్థానికులు సుబ్రమణ్యంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తనపై అత్యాచారం జరిగిన ఘోరాన్నితల్లి బైటకు చెబుతానని అనడంతో రెచ్చిపోయిన ఇతడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఇతడు గతంలో కూడా ఇలాగే సొంత చెల్లెలిపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.