వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దానికి కారణం చంద్రబాబే, ఎన్నాళ్లీ నాటకాలు: జోగి రమేష్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జోగి రమేష్ విమర్శించారు. అసమర్థ ముఖ్యమంత్రి పాలన చేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు.
నాలుగేళ్లుగా చంద్రబాబు మోసపూరి మాటలు వినీ విని రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు .ప్రత్యేక హదా భిక్ష కాదని, మన ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు.
చంద్రబాబు ఇంకా ఎన్నాళ్లు ఈ నాటకాలు ఆడుతారని ఆయన ప్రశ్నంచారు. ప్రత్యేక హోదా కసం యవకులు, విద్యార్థులు గళమెత్తుతున్నారని ఆయన చెప్పారు.
Comments
English summary
The YSR Congress party leader Jogi Ramesh blamed Andhra Pradesh CM Nara Chandababu Naidu on special category status.
Story first published: Monday, February 5, 2018, 16:40 [IST]