విభజన హామీలపై కేంద్రం అఫిడవిట్: కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ
అమరావతి: సుప్రీం కోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనిపై సుప్రీం కోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడులు గురువారం వేర్వేరుగా స్పందించారు. యనమల అఫిడవిట్పై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పగా, చంద్రబాబు అఫిడవిట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం అఫిడవిట్కు కౌంటర్ దాఖలు చేస్తామని యనమల చెప్పారు. కేంద్రం అఫిడవిట్ సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. అఫిడవిట్ ఏపీకి వ్యతిరేకంగా ఉందని బీజేపీ, వైసీపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. దీనిపై జగన్, పవన్ కళ్యాణ్లు స్పందించాలని డిమాండ్ చేశారు.
అన్నీ ఇచ్చేశాం, అవి కుదరదు: విభజన చట్టంపై సుప్రీంలో కేంద్రం, టీడీపీ ఆగ్రహం
Recommended Video
ఏపీకి అన్నీ ఇచ్చామని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో అత్యున్నత న్యాయస్థానాన్ని కోర్టు తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ సరికాదని అభిప్రాయపడ్డారు.