ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం కాని..... వైసీపీ అధినేత జగన్
Recommended Video
వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి గల కారణాల్లో స్సెషల్ స్టేటస్ ఒకటి...అయితే దీన్ని సాధించడం కోసం జగన్ ఇప్పటికే కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తన ప్రచారం చేశారు.ఈనేపథ్యంలోనే ఎ్ననికల ఫలితాలు వచ్చిన రోజే ప్రకటన చేశారు. అయితే ఇది కోంత కష్టమైన పనిగానే అయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఊహించని ఫలితాలను ప్రజలు నరేంద్రమోడీకి కట్టాబెట్టారని ఆయన చెప్పారు.
ఈనేపథ్యంలోనే జగన్ ఓ జాతీయ మీడియా చానల్తో మాట్లాడుతూ ...రాష్ట్ర్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాలతో ఏపికి ప్రత్యేక హోదా సాధించవచ్చని, కాని ప్రస్థుతం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, బీజేపీకి 351 స్థానాలు సాధించి, పెద్ద మొత్తంలో మెజారీటీ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధించడం కష్టతరం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైన తమ ఎంపీలతో కలసి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రధాని నరేంద్రమోడీని కలిసి ప్రత్యేకంగా తాను చర్చిస్తానని జగన్ తెలిపారు.
ఇక గత బీజేపీ ప్రభుత్వానికి అపధ్దర్మ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనే , స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. మరోవైపు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా కొనసాగిన నేపథ్యంలోనే.. ప్రత్యేక హోదాకు బదులుగా ఇతర మార్గాల్లో నిధులను సమకూరుస్తామని స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయంతో చివరికి విభేదించిన చంద్రబాబు నాయుడు బయటికి వచ్చిన విషయం తెలిసిందే...2014లోనే బీజేపీ స్వంతగా 282 సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు కూడ ఆమార్కు దాటీ భాగస్వామ్య పక్షాలతో కలిసి 351 స్థానాలను గెలుకుంది. మరి ఇలాంటీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నట్టుగా ప్రత్యేక హోదాపై మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.