కేంద్రంపై అవిశ్వాసం, విప్ జారీ చేసిన వైసీపీ: పవన్ కళ్యాణ్కు విజయసాయి కితాబు
అమరావతి: కేంద్రంపై అవిశ్వాసం నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి విప్ జారీ చేశారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం వైఫల్యం చెందడంపై ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు. శుక్రవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. రేపు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై లోకసభ సెక్రటరీ జనరల్కు వైవీ సుబ్బారెడ్డి నోటీసు ఇచ్చారు.
కేంద్రంపై అవిశ్వాసం ఏ పార్టీ పెట్టినా మద్దతిస్తామంటూ టీడీపీ స్పష్టం చేసింది. మరోవైపు మద్దతు కోసం వైసీపీ టీడీపీ, శివసేన, టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను సంప్రదించింది.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ టీడీపీపై విమర్శలు చేయడాన్ని వైసీపీ స్వాగతించింది. ఆ పార్టీ నేత విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. తాము స్వాగతిస్తున్నామన్నారు. మరోవైపు కలిసి పని చేసేందుకు సిద్ధమని బొత్స చెప్పారు.