టిడిపిలోకి కాంగ్ ఎమ్మెల్యే? అంత ఈజీకాదని శైలజానాథ్
సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లాబీల్లో శ్రీధర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ... ఫిబ్రవరి మొదటి వారంలో తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని వ్యాఖ్యానించారు. మొదటి నుండి టిడిపిలో ఉన్న తాను కొన్ని కారణాల వల్ల పిఆర్పీలో చేరానని, ఇప్పుడు సొంత గూటికి వెళ్తానన్నారు. మంత్రి శైలజానాథ్, టిడిపి నేత పయ్యావుల కేశవ్ల మధ్య కూడా చర్చ జరిగింది. పలువురు నేతలు పార్టీలు మారుతారనే ప్రచారం జరుగుతోంది.
దీనిపై శైలజానాథ్ మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతంలో పార్టీలు మారడం అంత వీజీ కాదన్నారు. అదే సమయంలో సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలని పయ్యావులను కోరారు. దానికి పయ్యావుల స్పందిస్తూ... సభలో చర్చకు సహకరించేందుకు తాము సిద్ధమేనని అయితే, చర్చకు ముందు సమాచారం తమ ముందు పెట్టాలని కోరారు.
పది గంటలకు బిఏసి సమావేశమైంది. ఈ సమావేశానికి టిడిపి నుండి మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎర్రబెల్లి దయాకర రావు, పయ్యావుల కేశవ్లు హాజరయ్యారు. మరోవైపు మండలిలో కూడా జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది.