హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పు చేయలేదు: జగన్ కేసులో కోర్టుకు ఎన్ శ్రీనివాసన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srinviasan appears before court in YS Jagan case
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్ కేసులోని ఇండియా సిమెంట్స్ ఛార్జీషీటుపై శ్రీనివాసన్‌తో పాటు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టుకు హాజరైన సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తమ నిజాయితీని న్యాయస్థానంలో నిరూపించుకుంటామని చెప్పారు. సిబిఐ విచారణ జరుపుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాసన్ తెలిపారు.

కాగా, ఆస్తుల కేసు కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలతో పాటు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి గురువారం కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఆయా చార్జిషీట్లలో సమన్లు అందుకున్న ఇతర నిందితులు కూడా కోర్టుకు వచ్చారు.

వీరిని డిసెంబర్ 3న తిరిగి హాజరు కావాలని సిబిఐ రెండో ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి పదోన్నతిపై హైకోర్టుకు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీ ఇంకా భర్తీ చేయని నేపథ్యంలో, సిబిఐ రెండో కోర్టు న్యాయమూర్తి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

English summary

 BCCI chief N Srinivasan, an accused in graft case involving YS Jaganmohan Reddy, has appeared before CBI court in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X