వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకేరోజు జగన్‌కు ముగ్గురు షాక్: ఆసక్తికర సన్నివేశం, బాబుపై గాదె ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం నాడు మరో షాక్ తగిలింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బుడ్డాతో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు.

బుడ్డా చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా వైసిపి కన్వీనర్‌గా ఉన్న బుడ్డాను టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, శిల్పాలు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ శిల్పా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్షేమ, సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆర్థికంగా బలీయంగా ఉన్న శిల్పా చేతిలో ఆర్థికంగా బాగా చితికిపోయిన బుడ్డా ఓటమి ఖాయమని చాలామంది భావించారు.

Srisailam MLA Budda joins Telugudesam

అయితే ఆ ఎన్నికల ఫలితాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ... శిల్పాపై బుడ్డా గెలిచారు. మెజార్టీ స్వల్పమే అయినా ఓడిపోతాడనుకున్న నేత గెలుపొందారు. ఆ తర్వాత శిల్పా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బుడ్డాను శిల్పా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, గురువారం ఒక్కరోజే ముగ్గురు ముఖ్య నేతలు టిడిపిలో చేరారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు సైకిల్ ఎక్కారు. వారికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

బాబును మెచ్చుకున్న గాదె

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. తాను ఈ నెల 29న టిడిపిలో చేరుతానని చెప్పారు. తాజాగా, గురువారం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని చెప్పారు. రేపు చంద్రబాబును కలిసి సైకిల్ ఎక్కుతానన్నారు.

వైయస్ జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. బుధవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి టిడిపిలో చేరారు. ఈ రోజు (గురువారం) బుడ్డా చేరారు. మరికొందరు వరుసలో ఉన్నారని అంటున్నారు.

English summary
Srisailam MLA Budda Rajashekar Reddy joins Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X