హైద్రాబాద్లో మహిళ హత్య:ట్రిపుల్ ఐటి విద్యార్థి సూసైడ్
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని అధారాలు సేకరించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే మంటల్లో పూర్తిగా కాలిపోయిన మహిళను పోలీసులు గుర్తించలేకపోయారు. ఎటువంటి అధారాలు లభించకుండా చేసేందుకే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు.
బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య
అదిలాబాద్ జిల్లాలో గల బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల భవనంపై నుంచి దూకి నాగరాజు అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తలకి తీవ్ర గాయం కావడంతో మృతుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా కనగల్ మండలం గౌరారానికి చెందిన నాగరాజు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. భవనం నాలుగో అంతస్తు నుండి దూకాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, కళాశాల ప్లేస్మెంట్లలో ఉద్యోగం రాని కారణంగా అసంతప్తికిలోనైన నాగరాజు ఈ ఘాతకానికి పాల్పడి వుంటాడని అనుమానిస్తున్నారు.