నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం క్యాంపస్లో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీనరసింహా అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతునిది తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం. అయితే, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
కర్నూలు: జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరులో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. తోటి చిన్నారితో ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బాలికను ఇంట్లోకి తీసుకొని వెళ్లి ఈ దారుణానికి ఒడి గట్టాడు. రక్తస్రావమైన చిన్నారి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
English summary
A student allegedly committed suicide in Nuzvid triple IT.
Story first published: Thursday, October 12, 2017, 1:30 [IST]