వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ఫీతో చావు ఒడిలోకి...గోదావరి నదిలో పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి: ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా జనాలను సెల్ఫీల పిచ్చి వదలడం లేదు. తాజాగా ఇలాగే సెల్ఫీ మోజులో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా మరో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే...

పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ప్రాజెక్ట్ ను చూసేందుకని కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సాయిరమ్య అనే విద్యార్ధిని తన స్నేహితురాలితో కలిసి అక్కడకు వెళ్లింది. ఆ ప్రాజెక్ట్ వద్ద వీరు సెల్ఫీలు దిగుతూ అడ్డుకట్ట దాటి నదికి మరీ చేరువలోకి వెళ్లడంతో ఒకరితర్వాత ఒకరు ఇద్దరూ గోదావరి నదిలో పడిపోయారు.

Students Fell into Godavari While Taking Selfie at Pattiseema

వీరు నదిలో పడటం చూసిన స్థానికులు రక్షించేందుకని వెంటనే నీళ్లలోకి దూకినా సాయిరమ్య స్నేహితురాలినైతే కాపాడగలిగారు గానీ అప్పటికే సాయిరమ్మ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. దీంతో సాయిరమ్య గల్లంతు కాగా ఆమె స్నేహితురాలు అప్పటికే బాగా నీళ్లు మింగేయడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన సాయి రమ్య ఆచూకి కోసం గాలింపు జరుపుతున్నారు.

English summary
West Godavari: In a tragic incident two students of West Godavari District were drowned in pattiseema. These two Girls lost control while taking selfie and drowned in the fast moving currents of it. In these two students one Girl survived and a search was on to find the other girl body. “Two Girls-Sai Ramya of Dommeru not be saved by the locals, and her friend was saved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X