పేస్ బుక్ లో సూసైడ్ లెటర్ పోస్ట్ :ఆత్మహాత్యకు ముందే అప్ లోడ్.
ఏలూరు : ఏ కష్టం వచ్చిందో తెలియదు. చదువుల్లో ముందుండేవాడు. తెలివైన విధ్యార్థిగా అందరిచేత గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఐఎఎస్ కావాలనే తన కలను నెరవేర్చుకోకుండానే తనువు చాలించాడు. పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొన్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఏలూరు రూరల్ మండలంలోని వెంకటాపురం పంచాయితీలోని నెహ్రునగర్ రెండో రోడ్డుకు చెందిన దుప్పల హేమారావు అక్టోబర్ 31వ, తేది సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళి శవమై తేలాడు.గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి భీమడోలు వద్ద శవమై తేలాడుహేమారావు ఇంటి నుండి తీసుకెళ్ళిన సైకిల్ ఏలూరు రైల్వేస్టేషన్ లో దొరికింది.
ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బిఎస్ సి మూడవ సంవత్సరం చదువుతున్నాడు హేమారావు.అక్టోబర్ 31వ, తేది సాయంత్రం 4.29 నిమిషాలకుఆయన ఫేస్ బుక్ టైమ్ లైన్ లో సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడు.చిన్ననాటి నుండి విద్యాభ్యాసంలో ముందుండేవాడు హేమారావు.ఇతరులకు సహాయం చేయాలనే తలంపు కూడ ఉంది. ఐఎఎస్ కావాలనే లక్ష్యంతో చదివేవాడని తోటి విధ్యార్థులు చెబుతున్నారు.
సూసైడ్ నోట్ చాల చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంది. ఈ నోట్ లో ఏముందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.భీమడోలు వద్ద మృతదేహం దొరికినప్పటికీ అక్కడ సెల్ పోన్ బ్యాంకు ఎటిఎం కార్డులు మాత్రమే లభ్యమయ్యాయి. కాని,సూసైడ్ నోట్ మాత్రం లభించలేదు.హేమారావు ఆత్మహాత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమి ఉన్నాయనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.