బిజెపిలోకి టిడిపి నేత రాంబొట్ల: పవన్కు బాబు పిలుపు
రాష్ట్ర విభజన అనివార్యం అయితే, హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిని చేయాలన్న డిమాండ్తో రాంబొట్ల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిడిపికి భవిష్యత్ ఉండదన్న అంచనాతో రాంబొట్ల బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, సోమవారం సుధీష్ రాంబోట్ల... చంద్రబాబు కోటరీ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కోటరీ వారి అడుగులకు మడుగులొత్తుతేనే ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బాబు కోటరీ సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్, కిరణ్లకు బాబు పిలుపు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కిరణ్ పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్లేనని చెప్పిన చంద్రబాబు... తెలుగు ప్రజల కోసం నిజంగా పోరాడాలనుకుంటే టిడిపికి మద్దతివ్వాలన్నారు.
కిరణ్ అయినా, మరెవ్వరైనా కొత్త పార్టీ పెట్టే వారికి సీమాంధ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే టిడిపికి మద్దతివ్వాలన్నారు. కిరణ్ సిఎంగా ఉండే ఏం చేయలేని వ్యక్తి, ఇక పార్టీ పెట్టి ఐదారు సీట్లు గెలుచుకొని ఏం చేయగలరు? ఆయనకు ఉద్యోగం తప్ప మరేమీ ప్రయోజనం లేదు అని చంద్రబాబు ఏద్దేవా చేశారు. సీమాంధ్రలో టిడిపికి వన్సైడ్గా ఓట్లు వేసి, పూర్తి మేజారిటీ ఇచ్చి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైనపుడే శరవేగంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని బాబు అన్నారు.